భూకంపాలు

భూకంపాలు
ప్రకృతి విలయాల్లో అత్యంత ఆస్తి, ప్రాణనష్టాలను కలిగించేది భూకంపం. భూపటలంలో అకస్మాత్తుగా శక్తి విడుదలవడం వల్ల భూమి ఉపరితలం కంపించి, ఇది సంభవిస్తుంది. టెక్టోనిక్‌ ప్లేట్ల కదలికలు, అగ్ని పర్వత విస్ఫోటనం, గనుల తవ్వకం, భారీ జలాశయాల నిర్మాణం లాంటి కారణాల వల్ల ఈ శక్తి ఉద్భవిస్తుంది. సాధారణంగా నిమిషం కంటే తక్కువ వ్యవధిలోనే ప్రకంపనలు ఉంటాయి. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా తరచూ చోటుచేసుకుంటున్న భూకంపాల గురించి అన్ని పోటీపరీక్షల్లోనూ ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో భూకంపాల గురించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం..!
ముఖ్యాంశాలు
  • భూకంపం ఏర్పడే ప్రాంతాన్ని ‘భూకంప నాభి’/ ‘భూకంప కేంద్రం’ (hypocenter) అంటారు. పైభాగంలో భూమి ఉపరితలం మీద లంబంగా ఉండే ప్రాంతాన్ని ‘ఆది కేంద్రం’ (epicenter) అంటారు. దీన్నుంచి దూరంగా వెళ్లే కొద్దీ ప్రకంపనల తీవ్రత తగ్గుతుంది. 
  • భూకంపాల అధ్యయన శాస్త్ర విజ్ఞానాన్ని ‘సిస్మాలజీ’ అంటారు. సిస్మోస్‌ అనేది గ్రీకు భాషా పదం. దీనికి అర్థం ట్రేమర్, అంటే అఘాతం లేదా భూకంపం.
ఎలా సంభవిస్తాయి?
  • భూపటలంలో చాలా లోతున రెండు లేదా అంతకంటే ఎక్కువ టెక్టోనిక్‌ ప్లేట్లు ఢీకొనడం వల్ల భూకంపం వస్తుంది. దీని ప్రభావం భూమి ఉపరితలంపై కనిపిస్తుంది. అంతర్గత శక్తుల కారణంగా భూమి అకస్మాత్తుగా, తీవ్రంగా కంపిస్తుంది. ఆ సమయంలో భూకంప కేంద్రం నుంచి అన్ని దిశల్లో తరంగాలు ప్రయాణిస్తాయి.
  • భూఫలకాలు మానవ స్పర్శకు తెలియని స్థాయిలో నిరంతరం కదులుతూనే ఉంటాయి. అయితే ఆ సమయంలో భూ పొరలు బలహీనంగా ఉన్నచోట్ల ఒక్కోసారి కంపనాలు సంభవిస్తాయి.
  • భూఫలకం అంచుల చుట్టూ తరచూ భూకంపాలు చోటుచేసుకుంటాయి. 
ఉదా: భారత ఉపఖండం భూకంపాలకు అత్యంత అనువుగా ఉండే రెండు ఖండాంతర పలకల సరిహద్దుల్లో ఉంది. హిమాలయ పర్వతశ్రేణి ఇండియన్‌ పలక, యురేషియన్‌ పలక కిందకు వెళ్లే ప్రాంతం వద్ద ఉంది. భారతదేశ భూపలక ఉత్తర దిశగా, ఈశాన్యంవైపు కదులుతూ ఉంటుంది. ఈ పలక ఏడాదికి 5 సెం.మీ. చొప్పున ప్రయాణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారతదేశానికి పైభాగంలో ఉన్న యురేషియన్‌ భూపలక ఉత్తరంగా ఏడాదికి 2 సెం.మీ. చొప్పున కదులుతుంది. ఆ రెండు పలకల కదలికల్లో తేడాలు ఉండటం వల్ల భారత భూపలక యురేషియన్‌ పలకను ఢీకొంటోంది. అందుకే హిమాలయాల ప్రాంతంలో తీవ్రభూకంపాలు వస్తున్నాయి. 

భూపాతాలు, హిమపాతాలు, అణుప్రయోగాల నిర్వహణ, సొరంగాలు, గనుల పైకప్పులు కూలిపోవడం లాంటి ఉపరితల బలాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవించడం, భూమి లోపల యురేనియం, థోరియం లాంటి అణువిస్ఫోటక పదార్థాలు విఘటనం చెందడం, భూమిపై భాగంలో జరిగే భూస్వరూప ప్రక్రియలకు భూమి తీవ్రంగా గురైనప్పుడు అది సమతాస్థితికి వచ్చే ప్రయత్నంలో ఏర్పడే కదలికలు, భూ పటలంలోని రాతిపొరల కదలికల వల్ల ఏర్పడే విరూపకారక బలాలు మొదలైనవన్నీ భూకంపాలకు కారణాలుగా ఉన్నాయి. 

భూకంప తరంగాలు - వాటిలో రకాలు, భూకంప తీవ్రతను కొలిచే పరికరాలు, ప్రపంచవ్యాప్తంగా సంభవించిన భూకంపాలు, భారత్‌లో భూకంప మండలాలు తదితర పూర్తి సమాచారంతోపాటు ఎస్‌ఎస్‌సీ, టీజీపీఎస్సీ, యూజీసీ నెట్‌ తదితర పరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌... ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978
ముందుగా గుర్తించొచ్చా?
భూకంపాలు ఎక్కడ, ఎప్పుడు వస్తాయో తెలుసుకోవడం కష్టం. కానీ, అవి సంభవించడానికి ముందు ఏర్పడే ప్రకంపనాలను కొన్ని జంతువులు గుర్తించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. పాములు భూకంపం రావడానికి కొన్ని రోజుల ముందే భూమిలోంచి బయటకు వస్తాయి. పావురాళ్లు తమ దిశలను మార్చుకుంటాయి. కుక్కలు, ఎలుకలు, పిల్లులు అసాధారణంగా అరుస్తాయి. చేపలు నీటిలో అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కాబట్టి, వీటి ప్రవర్తనల ఆధారంగా భూకంపాలను పసిగట్టే సాంకేతికతలను అభివృద్ధి చేసే అవకాశముంది. 
 
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
 
1. భూకంపానికి ప్రధాన కారణం?
(హెచ్‌పీ జేబీటీ టీఈటీ, 2019)
1) క్రమక్షయం      2) అచ్ఛాదనక్షయం 
3) టెక్టోనిక్‌ బలాలు  4) శిథిలీకరణం
సమాధానం: 3
2. భూకంప తీవ్రతను కింది దేనితో కొలుస్తారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2023)
1) అనిమో మీటర్‌    2) ప్రెజర్‌ సెన్సార్స్‌  3) గ్రామీ మీటర్‌    4) రిక్టర్‌ స్కేలు
సమాధానం: 4
3. With reference to earthquakes, which of the following statements are correct?
i. Earthquakes largely occur along the converging plate boundaries.
ii. Point of origin of the earthquake in the lithosphere is known as the focus/Hypocentre.
iii. The intensity of the earthquake decreases with distance from the epicentre.
iv. The epicentre of the earthquake always remains over continents only.
Select the correct answer using the code given below.
(CDS GK Previous Paper 2016)
1) i and ii only 2) i, ii and iii 3) ii and iii only 4) i and iv
Ans: 2
4. Which of the following regarding earthquake is correct?
I. P waves - Longitudinal
II. S waves - Transverse
(DSSSB TGT Computer Science 2021)
1) Both I and II 2) Only II 3) Only I 4) Neither I nor II
Ans: 1
5. Consider the following statements regarding the earthquakes:
I. The intensity of earthquake is measured on Mercalli scale.
II. The magnitude of an earthquake is a measure of energy released.
III. Earthquake magnitudes are based on direct measurements of the amplitude of seismic waves.
IV. In the Richter scale, each whole number demonstrates a hundredfold increase in the amount of energy released.
Which of these statements are correct?
(Kerala PSC KAS 2019)
1) I, II and III 2) II, III and IV 3) I and IV 4) I and III
Ans: 1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram