టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన అతడు.. రెండు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ రెండో, భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మూడో స్థానంలో ఉన్నారు.
గత దశాబ్దంలో చాలా వరకు టాప్-10లోనే ఉన్నా.. నంబర్వన్ ర్యాంకు సాధించడం 38 ఏళ్ల రోహిత్కు ఇదే తొలిసారి.