బంగ్లాదేశ్లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తోన్న ప్రణయ్ వర్మ.. బెల్జియం, ఐరోపా సమాఖ్య(ఈయూ)కు తదుపరి రాయబారిగా నియమితులయ్యారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) 2026, ఏప్రిల్ 10న తెలిపింది. భారత్-ఈయూల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదిరిన కొన్నిరోజులకే ప్రణయ్ వర్మ నియామకం జరిగింది.