కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు

కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు

కోల్‌కతాలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌), వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (E-1 గ్రేడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ: 660

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష (హిందీ), కంపెనీ సెక్రటరీ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ & దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏప్రిల్ 2026 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్లు ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ & దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).

వేతనం: నెలకు రూ.60,000. 

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ1,180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు & కోల్ ఇండియా ఉద్యోగులకు రుసుము లేదు.

ఎంపిక విధానం: కేవలం కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (CBT)లో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 12-05-2026.  

దరఖాస్తుకు చివరి తేదీ: 11-06-2026.

Website:https://www.coalindia.in/career-cil/jobs-coal-india/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram