దేశంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో భూగర్భ సవాళ్లను అధిగమించేందుకు, అత్యాధునిక పరిశోధన సంపత్తిని సమకూర్చుకునేందుకు నార్వేతో హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఐఆర్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రధాని మోదీ నార్వే పర్యటన సందర్భంగా భారత్లో శాస్త్ర సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు 12 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా జియోసైన్స్లో ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఎమరాల్డ్ జియోమోడలింగ్తో ఎన్జీఆర్ఐ కీలక ఎంఓయూ చేసుకుంది. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కళైసెల్వీ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.