చంద్రుడి ఉపరితలం మొత్తం ఒకే ధూళి కుప్పలా లేదని, అది కేక్ తరహాలో రెండు పొరలతో కూడి ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. చంద్రయాన్-3 మిషన్కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ నిర్వహించిన ఒక ప్రయోగంలో ఇది వెల్లడైందని వివరించింది. చంద్రుడి ఉపరితలం నిరంతరం చిన్నపాటి ఉల్కల ఢీకి లోనైందని ఈ రెండు పొరలు స్పష్టంచేస్తున్నాయి. జాబిల్లి పైపొర గట్టిపడినప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఇస్రో తెలిపింది.