ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన నూతన సాంకేతిక మార్గదర్శకుల (లేటెస్ట్ న్యూ టెక్నాలజీ పయనీర్స్) జాబితాలో.. అంతరిక్ష రంగంలోని ధ్రువ, వాతావారణ రంగంలోని వరాహ సహా 9 భారతీయ అంకురాలు చోటు దక్కించుకున్నాయి. 23 దేశాలకు చెందిన 100 ప్రారంభ దశ అంకురాలు ఏఐ (కృత్రిమమేధ) తదుపరి శకానికి అవసరమైన మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్నాయని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.
పరిశ్రమలు, సమాజ తీరును మార్చగల సామర్థ్యం ఉన్న విప్లవాత్మక సాంకేతికతలను ఇవి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది. మన దేశం నుంచి చోటు దక్కించుకున్న 9 అంకురాల్లో చాలా వరకు డీప్-టెక్, అంతరిక్ష ఆవిష్కరణలపై దృష్టి సారించాయి.