భారత సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా అజిత్ అగార్కర్ కొనసాగనున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని అగార్కర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పునరుద్ధరిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ హయాంలో టీమ్ఇండియా ఉత్తమ ప్రదర్శన చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.