మాల్దీవుల్లో పెరుగుతున్న తట్టు కేసులను అరికట్టేందుకు, అక్కడ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు దాదాపు మూడు వేల టన్నుల వైద్య సామగ్రిని, 20 వేల డోసుల తట్టు వ్యాక్సిన్లను భారత్ ఆ దేశానికి పంపింది. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో భారత్ ఇది చేపట్టింది. మాల్దీవుల ఆరోగ్య శాఖ మంత్రి జీలా అలీ హాజరైన ఓ అధికారిక కార్యక్రమంలో ఈ సామగ్రిని అందజేశారు.