విదేశాలకు చెందిన మూడు ప్రముఖ విశ్వవిద్యాలయాలు త్వరలోనే భారత్లో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నాయి. బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ యార్క్.. ముంబయిలో; ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్వేల్స్ బెంగళూరులో క్యాంపస్లను నెలకొల్పేందుకు వీలుగా అనుమతి పత్రాలను మంజూరు చేసినట్లు కేంద్ర విద్యా శాఖ 2026, జూన్ 9న తెలిపింది.