దేశంలో జన్ధన్ ఖాతాల సంఖ్య 58 కోట్లు మించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026, జూన్ 8న వెల్లడించారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2014, ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధి, తక్కువ ఖర్చుతో బీమా, పింఛన్ల వంటివి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు చేరుతున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.