భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో నీటి వనరుల నిర్వహణ కోసం శాటిలైట్ టెక్నాలజీ, అంతరిక్ష ఆధారిత అనువర్తనాల వినియోగాన్ని బలోపేతం చేసేందుకు ఈ అగ్రిమెంట్ ఉపకరిస్తుంది. దిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జలశక్తి మంత్రిత్వ శాఖ 2026, జూన్ 1న నిర్వహించిన జల రంగంలో పరిశోధన, అభివృద్ధిపై జాతీయ వర్క్షాప్ సందర్భంగా ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.