ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, ఏప్రిల్ 18న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ పథకాన్ని 2028 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసకున్నారు. వచ్చే మూడేళ్లలో రూ.83,977 కోట్లు దీనికింద ఖర్చు చేయనున్నారు. వ్యవసాయ మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులకు రహదారులు నిర్మించేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు.