కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024, 2025 సంవత్సరాలకు ప్రకటించిన పురస్కారాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 18 మంది ఎంపికయ్యారు. 2026, మార్చి 22 నుంచి 26 మధ్య దిల్లీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్, డ్యాన్స్, డ్రామాలో నిర్వహించిన సంగీత నాటక అకాడమీ జనరల్ కౌన్సిల్ మీటింగ్లో రెండేళ్లకు కలిపి ఏడుగురిని ఫెలోషిప్నకు, 108 మందిని సంగీత నాటక అకాడమీ పురస్కారాలకు, 106 మందిని ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలకు ఎంపిక చేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఫెలోషిప్నకు ఒకరు, 2024 సంవత్సరం సంగీత నాటక అకాడమీ పురస్కారాలకు ఆరుగురు, 2025 సంవత్సరానికి నలుగురు ఎంపికయ్యారు. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలకు 2024కు ముగ్గురు, 2025కు నలుగురు ఎంపికయ్యారు.