కీర్తి చక్ర

కీర్తి చక్ర

భారత్‌ తొలిసారిగా చేపడుతున్న మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’కు ఎంపికైన వ్యోమగామి ఎయిర్‌ కమొడోర్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీర్తి చక్ర ప్రదానం చేశారు. 2026, జూన్‌ 8న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె.. విధి నిర్వహణలో అత్యుత్తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన సైనిక దళాల సిబ్బందికి పతకాలను అందించారు. శాంతికాలంలో ఇచ్చే రెండో అత్యున్నత సాహస పురస్కారమైన కీర్తి చక్రను నాయర్‌ సహా ఏడుగురికి ప్రదానం చేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram