సీపెట్‌లో బీటెక్‌ అడ్మిషన్లు

సీపెట్‌లో బీటెక్‌ అడ్మిషన్లు

భారత ప్రభుత్వ రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌), జైపూర్.. 2026-27 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు ఆహ్వానిస్తోంది. ఇవి రాజస్థాన్ ఇంజినీరింగ్ అడ్మిషన్ ప్రాసెస్ (REAP) ద్వారా జరుగుతాయి. జేఈఈ మెయిన్ స్కోర్ ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 

వివరాలు:

1. బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ ప్లాస్టిక్ టెక్నాలజీ: 60 సీట్లు

2. బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ మెకానికల్ ఇంజినీరింగ్: 60 సీట్లు

3. బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్: 30 సీట్లు

అర్హత: గణితం, భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం సబ్జెక్టులలో కనీసం 45% మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా 3 సంవత్సరాల కోర్సులో చేరవచ్చు. మొదట జేఈఈ మెయిన్ స్కోర్ ఉన్నవారికి, ఆ తర్వాత ఖాళీలను బట్టి 12వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు.

వయోపరిమితి: గరిష్ఠ వయసు పరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు బ్రోచర్‌లో ఇచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విడుదల తేదీ: 09.04.2026.

దరఖాస్తు చివరి తేదీ: 9.5.2026

Website:https://www.cipet.gov.in/index.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram