నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2026

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2026

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌) అనేది కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ కార్యక్రమం, ఇది ఆర్థికంగా బలహీనమైన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని  అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం 8వ తరగతి తరువాత విద్యార్థులు డ్రాప్‌ఔట్ కాకుండా వారిని ప్రోత్సహించడం, ప్రాథమిక విద్యను కొనసాగించడం.  

వివరాలు: 

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ (NMMSS) 2026-27

వేతన వివరాలు: ఈ పథకానికి ఎంపికైన లక్ష మంది విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

అర్హత: విద్యార్థులు ప్రభుత్వ/ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతిలో చదువుతూ ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు. విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు 5శాతం సడలింపు ఉంటుంది).

గమనిక: కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు.

వయోపరిమితి: సాధారణంగా 13-15 సంవత్సరాల వయస్సులో 8వ తరగతి విద్యార్థులు అర్హలు.

దరఖాస్తు విధానం: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (NSP) (https://scholarships.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్కూల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ధ్రువీకరిస్తారు. ధ్రువీకరణ అనంతరం విద్యార్థి బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ గా స్కాలర్‌షిప్ జమ చేస్తారు.

రాత పరీక్ష: ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. 

పరీక్ష విధానం:

1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్‌): 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 90 మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

2. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్‌): 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. మొత్తం 90 మార్కులు. 7, 8 తరగతుల స్థాయిలో సోషల్‌, సైన్స్, మ్యాథ్స్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

ముఖ్య విషయాలు:

ఒక్కో విద్యార్థికి రూ.12,000 ప్రతి సంవత్సరం అందుతుంది.

స్కాలర్‌షిప్ అత్యధికంగా 4 సంవత్సరాల పాటు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కొనసాగుతుంది.

పదో తరగతిలో కనీసం 60శాతం మార్కులు (ఎస్సీ/ఎస్టీ 55%) సాధించాలి.

ఏదైనా కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను ఒకే సమయంలో రెండవదాన్ని పొందలేరు.

స్కాలర్‌షిప్ ఎన్‌ఎస్‌పీ ద్వారా మాత్రమే పొందవచ్చు.

ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది.

విద్యార్థులు మ్యాట్‌ & శాట్‌ పరీక్షల్లో కనీసం 40శాతం మార్కులు (ఎస్సీ/ఎస్టీలు 32శాతం) సాధించాలి.

ముఖ్య తేదీలు: 

దరఖాస్తులు ప్రారంభం: 01.06.2026.

దరఖాస్తు చివరి తేదీ: 31.08.2026.

దరఖాస్తు పరిశీలన గడువు: 15.09.2026.

విద్యాసంస్థల పరిశీలన గడువు: 15.09.2026.

డీఎన్‌ఓ/ఎస్‌ఎన్‌ఓ/ఎంఎన్‌ఓ పరిశీలన గడువు: 30.09.2026.

Website:https://scholarships.gov.in/All-Scholarships

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram