భారత స్వాతంత్య్రోద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించడంతోపాటు బ్రిటిష్ ప్రభుత్వం అన్యాయంగా పౌర హక్కులకు వ్యతిరేకంగా తెచ్చిన శాసనాలను ఉద్దేశపూర్వకంగా, శాంతియుతంగా ఉల్లంఘించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది పూర్ణ స్వరాజ్ (సంపూర్ణ స్వాతంత్య్రం) లక్ష్యంగా సాగింది. సహాయ నిరాకరణోద్యమం (1920) తర్వాత స్వరాజ్య పోరాటంలో రెండో ప్రధాన ప్రజా ఉద్యమంగా ఇది పేరుగాంచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉప్పును తయారు చేసి బ్రిటిష్ శాసనాలను ఉల్లంఘించాలనుకున్న గాంధీజీ 1930 మార్చి 12న సబర్మతి నుంచి దండికి కాలినడకన పయనమై శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. పోటీ పరీక్షల కోణంలో దీని గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
శాసనోల్లంఘన ఉద్యమ నేపథ్యం
మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 1928, డిసెంబరులో కలకత్తాలో కాంగ్రెస్ మహాసభ జరిగింది. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్) ఇవ్వాలని, లేకపోతే సంపూర్ణ స్వరాజ్యం కోసం ఉద్యమిస్తామని బ్రిటిష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఏడాదిలోగా బ్రిటిష్ ప్రభుత్వం అధినివేశ ప్రతిపత్తి ఇవ్వకపోతే సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటాన్ని, దాని సాధనకు శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని గాంధీజీ ప్రకటించారు.
చివరగా..
సంపూర్ణ స్వరాజ్య సాధనే ధ్యేయంగా సాగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మహోన్నత ఘట్టంగా నిలిచింది. రైతులు, మహిళలు, వ్యాపారులు, యువకులు సహా సమాజంలోని అన్ని వర్గాలవారు ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది భారతీయుల్లో స్వతంత్ర కాంక్షను రగిల్చింది. ఉద్యమకారులు బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించడంతోపాటు విదేశీ వస్తువులను బహిష్కరించడం ద్వారా వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. స్థానిక కుటీర పరిశ్రమలకు చేయూతనిచ్చారు. ఈ పోరాటం తర్వాతి కాలంలో భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది.
శాసనోల్లంఘన ఉద్యమ నేపథ్యం, గాంధీజీ ప్రతిపాదించిన డిమాండ్లు, ఉద్యమం జరిగిన తీరు, ఇతర ప్రాంతాల్లో ముందుండి నడిపిన నాయకులు, యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎస్ఎస్ సీ సీజీఎల్సహా పలు పోటీ పరీక్షల్లో ఈ అంశంపై అడిగిన బహుళైచ్ఛిక ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఉచిత ఈబుక్ కోసం ఈనాడు ఈప్రతిభ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. https://hov.to/0c0f8895
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. దండి మార్చ్ ఎప్పుడు ప్రారంభమైంది?
(గుజరాత్ పీఎస్ఐ ప్రిలిమ్స్, 2017),
(డీఎంఆర్సీ సీఆర్ఏ, 2020)
1) 1930, మార్చి 12 2) 1931, మార్చి 12
3) 1932, ఏప్రిల్ 6 4) 1930, ఏప్రిల్ 6
సమాధానం: 1
2. తమిళనాడులో ఉప్పుసత్యాగ్రహ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు?
(ఎస్ఎస్సీ జేఈ ఎంఈ, 2019), (టీఎన్యూఎస్ఆర్బీ, 2012),
(ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2022), (రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్, 2022)
1) సుబ్రమణ్య భారతి 2) సి.రాజగోపాలచారి
3) భారతిదాసన్ 4) శ్రీనివాస శాస్త్రి
సమాధానం: 2
3. మహాత్మా గాంధీతో కలిసి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ ఎవరు?
(పశ్చిమ బెంగాల్ పోలీస్ కానిస్టేబుల్, 2015)
1) అనిబిసెంట్ 2) మృదులా సారాభాయ్
3) ముత్తులక్ష్మి 4) సరోజినీ నాయుడు
సమాధానం: 4
4. దండి మార్చ్ ఎన్ని రోజులు సాగింది?
(బీపీఎస్సీ 66 కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్, 2022)
1) 10 రోజులు 2) 20 రోజులు 3) 24 రోజులు 4) 30 రోజులు
సమాధానం: 3
Link copied to clipboard!
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు
బెల్లో ప్రాజెక్ట్, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో సీనియర్ ఇంజనీర్ పోస్టులు
వైఎస్సార్ కడప జిల్లాలో ఉద్యోగాలు
ఎన్ఎల్సీలో హెల్త్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు
ఎన్ఐబీలో ఉద్యోగాలు
సీఐపీఈటీలో లెక్చరర్ పోస్టులు
సీఐపీఈటీలో లెక్చరర్, ప్లేస్మెంట్ కన్సల్టెంట్ ఉద్యోగాలు
ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు
ఐడీబీఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్ఎస్ఎస్ఎన్ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు
ఎన్సీపీఓఆర్లో ఉద్యోగాలు
ఈఎస్ఐసీ ముంబయిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సెయిల్-ఐఐఎస్సీఓలో పోస్టులు
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో అప్రెంటిస్షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
ఇరాన్ సుప్రీం లీడర్గా ఆయతుల్లా
నేపాల్లో ఆర్ఎస్పీ విజయం
పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్