అంతర్జాతీయ అటవీ దినోత్సవం

అంతర్జాతీయ అటవీ దినోత్సవం

దట్టమైన వృక్షాలు, పొదలతో కూడిన విశాల భూభాగాలను అడవులు అంటారు. ఇవి సహజ వనరులు. మానవ ప్రమేయం లేకుండానే ప్రకృతిలో వాటంతట అవే పుట్టి, పెరుగుతాయి. జీవావరణ వ్యవస్థలో, ప్రకృతి సమతౌల్యతలో కీలకమైనవిగా, అత్యంత విలువైనవిగా అడవులను పేర్కొంటారు. ఇవి అనేక వృక్షాలు, జంతు జాతులకు ఆవాసాలుగా ఉంటాయి. జనాభా పెరుగుదల, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి లాంటి కార్యకలాపాల వల్ల వీటి విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీంతో వన్యప్రాణులతోపాటు సమస్త భూమండలానికి ముప్పు వాటిల్లుతోంది. వీటిని అధిగమించి అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవం (World Forestry Day/ International Day of Forests)గా నిర్వహిస్తారు. అడవుల నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ప్రపంచవ్యాప్తంగా అడవులు..

  • భూతలంపై మూడింట రెండు వంతులకు పైగా జలావరణమే ఉంది. మిగిలిన భాగంలో 10% హిమనీనదాలతో కప్పి ఉండగా, మరో 19% ఎడారులు, dry salt flats, సముద్ర తీరాలు, ఇసుక దిబ్బల రూపంలో బంజరు భూమిగా నివాసయోగ్యం కానిదిగా ఉంది. నివాసయోగ్యమైన భూభాగంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ అడవులు ఆక్రమించాయి. అయితే మానవ కార్యకలాపాల ఫలితంగా వాటి విస్తీర్ణం నానాటికీ తగ్గుతోంది.
  • ఐక్యరాజ్యసమితి (ఐరాస) గణాంకాల ప్రకారం, ప్రపంచ భూభాగంలో 31% అడవులు ఉన్నాయి. అవి ఏటా సుమారు 15.6 బిలియన్‌ టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌ను గ్రహిస్తాయి.
  • అయితే భూమిపై అడవులు వేగంగా తరిగిపోతున్నాయి. 2000 నుంచి 2020 మధ్య కాలంలో సుమారు 100 మిలియన్‌ హెక్టార్ల అడవులు క్షీణించినట్లు ఐరాస పేర్కొంది.

భారతదేశంలో అడవులు..

  • భారతదేశ అటవీ నివేదిక (ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ - ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) 2023 ప్రకారం, దేశంలో మొత్తం అటవీ, చెట్ల విస్తీర్ణం 8,27,357 చ.కి.మీ. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 25.17%. అటవీ ప్రాంతం దాదాపు 7,15,343 చ.కి.మీ. (21.76%) విస్తీర్ణంలో ఉంది. అడవుల బయట చెట్ల ప్రాంతం 1,12,014 చ.కి.మీ. (3.14%)గా నమోదైంది.
  • దేశంలో మొదటిసారిగా అడవులను లెక్కించడం 1987 నుంచి ప్రారంభించారు. అడవులను ప్రతి రెండు సంవత్సరాలకోసారి లెక్కిస్తారు.
  • దేశంలో అడవుల విస్తీర్ణం, సాంద్రతలో మార్పులపై అంచనాలను డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) తయారు చేస్తుంది. 

ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ నివేదిక

  • భారతదేశ అటవీ నివేదిక (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌)-2023ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ 2024, డిసెంబరు 21న విడుదల చేశారు. భారత్‌లో 2021 నుంచి మొత్తం అటవీ, చెట్ల విస్తీర్ణం 1,445 చదరపు కిలోమీటర్లు పెరిగిందని, 2023లో భౌగోళిక ప్రాంతంలో ఇది 25.17 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. 2021-23 మధ్య కాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. 
    ముఖ్యాంశాలు..
  • 2005 స్థాయులతో పోలిస్తే భారత్‌ 2.29 బిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించినట్లు నివేదిక స్పష్టం చేసింది.
    2021 అంచనాలతో పోలిస్తే, దేశంలోని అటవీ, వృక్ష విస్తీర్ణంలో 1445 చ.కి.మీ. పెరుగుదల నమోదైంది. ఇందులో అటవీ విస్తీర్ణంలో 156 చ.కి.మీ., వృక్ష విస్తీర్ణంలో 1289 చ.కి.మీ. పెరుగుదల ఉంది.
  • దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4,992 చ.కి.మీ.
  • దేశంలో వెదురు సాగు విస్తీర్ణం 1,54,670 చ.కి.మీ.గా అంచనా. 2021 కంటే ప్రస్తుతం వీటి విస్తీర్ణంలో 5227 చ.కి.మీ. పెరుగుదల నమోదైంది.

చారిత్రక నేపథ్యం

భవిష్యత్తు తరాల వారికి అడవుల ప్రాముఖ్యాన్ని తెలపాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) మార్చి 21న ‘వరల్డ్‌ ఫారెస్ట్‌ డే’గా నిర్వహించాలని భావించింది. 1971లో జరిగిన ఎఫ్‌ఏఓ 16వ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలూ దీన్ని ఆమోదించాయి. తర్వాత 2012, నవంబరు 28న ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించింది.
2026 నినాదం: "Forests and Economies".

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2023),(ఎంపీ ఎక్సైజ్‌ కానిస్టేబుల్, 2023),

1) జూన్‌ 21   2) మార్చి 21

3) ఏప్రిల్‌ 21  4) ఆగస్టు 21

సమాధానం: 2

2. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
(ఎస్‌ఎస్‌సీ సీపీఓ టైర్‌-1, 2022), (యూపీ పోలీస్‌ ఎస్‌ఐ, 2021),
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2022)(కరళ పీఎస్సీ - గ్రాడ్యుయేట్‌ లెవల్, 2022),
(టీఎన్‌పీఎస్సీ గ్రూప్‌ 1, 2011)

1) హైదరాబాద్‌   2) కోల్‌కతా

3) బెంగళూరు    4) ముంబయి

సమాధానం: 1

3. ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) - 2023 ప్రకారం, అటవీ విస్తీర్ణంలో (వృక్ష విస్తీర్ణాన్ని మినహాయించి) అత్యధిక పెరుగుదలను కింది ఏ రాష్ట్రం నమోదు చేసింది?
(ఐబీ ఏసీఐఓ గ్రేడ్‌ 2 (ఎగ్జిక్యూటివ్‌), 2025)

1) ఒడిశా         2) నాగాలాండ్‌

3) మిజోరం     4) మధ్యప్రదేశ్‌

సమాధానం: 3
4. The Forest Survey of India under the ministry of Environment of India is located in which city?
(RRB NTPC CBT-I, 2021)

1) Guwahati    2) Bhopal

3) Dehradun   4) New Delhi

Ans: 3

5. Which of the following statement(s) is/are correct about 'India State of the Forest Report' (ISFR)?

A) The first State of the Forest Report was published in 1947.

B) The report is based on the biennial assessment of India's forests carried out by Forest Survey of India (FSI).

C) Based on the ISFR 2021 report the total forest cover of the country is 21.71% of the total geographical area of the country.

D) The ISFR 2021 report shows a decrease of forest cover as compared to the previous assessment.
(EMRS PGT (History), 2023)

1) Only (B), (C) and (D) are correct

2) Only (C) and (D) are correct

3) Only (B) and (C) are correct

4) Only (A), (B) and (C) are correct

Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram