‘ఫ్రం బారోయెర్స్‌ టు బిల్డర్స్‌’ నివేదిక

‘ఫ్రం బారోయెర్స్‌ టు బిల్డర్స్‌’ నివేదిక
  • సంస్థాగత వర్గాల నుంచి మహిళలు తీసుకున్న రుణాలు రూ.76 లక్షల కోట్లకు చేరినట్లు నీతి ఆయోగ్‌ 2026, ఏప్రిల్‌ 8న విడుదల చేసిన ‘ఫ్రం బారోయర్స్ టు బిల్డర్స్‌’ నివేదికలో పేర్కొంది. మొత్తం వ్యవస్థాగత రుణాల్లో ఇది 26% అని తెలిపింది. 2017 నుంచి మహిళలు తీసుకునే రుణాలు 4.8 రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. మహిళల్లో రుణాలు తీసుకొనేవారి నిష్పత్తి 36% పెరిగిందని, మహిళా రుణగ్రహీతల సంఖ్య 16 కోట్లకు చేరిందని పేర్కొంది.  అన్ని రంగాల్లో డిజిటలీకరణ విస్తృతమవడం వల్ల సంస్థాగత మార్గాల నుంచి రుణాలు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు గత దశాబ్దకాలంలో గణనీయంగా తగ్గాయని పేర్కొంది.  

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram