చట్ట సభల్లో మహిళలకు 33శాతం కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ల చట్టం-2023.. 2026, ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చిందంటూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజున ఈ నోటిఫికేషన్ రావడం గమనార్హం.
106వ రాజ్యాంగ సవరణ చట్టం-2023లోని సెక్షన్-1లో ఉన్న సబ్ సెక్షన్ (2) ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని 2026 ఏప్రిల్ 16వ తేదీని మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చే తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది అని నోటిఫికేషన్లో న్యాయశాఖ పేర్కొంది.