ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయబారి ప్రీతీ శరణ్ తిరిగి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఆమె 2027 నుంచి మూడేళ్ల పాటు కమిటీలో ఉంటారు. ప్రస్తుతం ఆమె కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు.
ఐరాస సభ్య దేశాలు ఆర్థిక, సామాజిక హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను ఏ మేరకు అమలు పరుస్తున్నాయో గమనించేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది. మానవ హక్కుల కమిషన్ పరిపాలక పర్యవేక్షణలో కమిటి పనిచేస్తోంది.