ప్రభుత్వ రంగంలోని పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా బుర్రా వంశీ రామ మోహన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సంస్థలో ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా సేవలు అందించిన ఆయనకు, సీఎండీ బాధ్యతలు అప్పగిస్తూ 2026, ఏప్రిల్ 1న బోర్డు ఆమోదం తెలిపింది. 2030 జులై 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు (ఏది ముందైతే అది) ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.