సాధ్వి సతీశ్‌ సైల్‌

సాధ్వి సతీశ్‌ సైల్‌

మిస్‌ ఇండియా-2026 కిరీటాన్ని గోవాకు చెందిన సాధ్వి సతీశ్‌ సైల్‌ సొంతం చేసుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కేఐఐటీ విశ్వవిద్యాలయం వేదికగా 2026, ఏప్రిల్‌ 19న జరిగిన 61వ ఫెమీనా మిస్‌ ఇండియా వేడుకలో ఆమెను విజేతగా ప్రకటించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది సుందరాంగులు పోటీ పడగా సాధ్వి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తదుపరి జరగబోయే 75వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఆమె అర్హత సాధించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram