ప్రతిష్ఠాత్మక ప్రిక్స్ వెర్సైల్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాల జాబితాలో అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (టెర్మినల్ 1), గువాహటి లోక్ప్రియ గోపినాథ్ బార్దోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (టెర్మినల్ 2) చోటు దక్కించుకున్నాయి. పారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఏటా ఈ అవార్డులను అందిస్తారు. ఆర్కిటెక్చర్, వినూత్నత, సస్టెయినబిలిటీ, సాంస్కృతిక గుర్తింపు, ప్రయాణికుల సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాటికి ఈ పురస్కారాలు దక్కుతాయి.