గడచిన దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల సరాసరి ఖర్చులు 131 శాతం మేర పెరిగాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2026, జూన్ 16న విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 22.18 లక్షల కోట్లుగా ఉన్న ఈ వ్యయం, 2024-25 సంవత్సరం కల్లా రూ. 51.20 లక్షల కోట్లకు పెరిగిందని తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి నిలిపిన కారణంగా ఇది సంభవించిందని కాగ్ పేర్కొంది.
రాష్ట్రాల బడ్జెట్లో రెవెన్యూ వ్యయానికి పెద్దపీట వేశారని మొత్తం వ్యయంలో ఇది సరాసరిన 83 శాతంగా నిలిచిందని నివేదిక తెలిపింది.