రక్షణ రంగంలోని ప్రభుత్వ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) లిమిటెడ్కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నవరత్న హోదా దక్కింది. సుస్థిరమైన పనితీరుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం ఈ హోదాను ప్రకటించినట్లు సంస్థ వెల్లడించింది. కోల్కతా కేంద్రంగా యుద్ధ నౌకలు నిర్మించే ఈ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.7,002 కోట్ల ఆదాయంపై రూ.748 కోట్ల లాభాన్ని పొందింది.