ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్ 1 నుంచి జూన్ 17 మధ్య దేశంలో నికర ఆదాయపు పన్ను వసూళ్లు 14.64% పెరిగి రూ.5.21 లక్షల కోట్లకు చేరాయి. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 22% వృద్ధితో రూ.2.08 లక్షల కోట్లకు, నికర కార్పొరేట్యేతర పన్ను వసూళ్లు 8% అధికమై రూ.2.94 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, సంస్థలు చెల్లించే పన్నులు కార్పొరేట్యేతర విభాగంలోకి వెళ్తాయి.
2026, మే 17 వరకు రూ.89,026 కోట్ల విలువైన రిఫండ్లను జారీ చేశారు. ఏడాది క్రితంతో పోలిస్తే ఇవి 1.19% ఎక్కువ.