వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (వైపో) విడుదల చేసిన తాజా పేటెంట్ కో-ఆపరేషన్ ట్రీటీ (పీసీటీ) ర్యాంకింగ్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్ఫామ్స్ గ్లోబల్ టాప్-20లో చోటు దక్కించుకుంది. 2025 సంవత్సరానికి విడుదల చేసిన జాబితాలో జియో ప్లాట్ఫామ్స్ ఏకంగా 320 స్థానాలు పైకి వచ్చి, 20వ స్థానంలో నిలిచింది. తద్వారా అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆవిష్కరణల సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
హువావే, శామ్సంగ్, క్వాల్కామ్, ఎల్జీ, పానాసోనిక్, నోకియా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ అగ్రగామి టెక్నాలజీ సంస్థల సరసన నిలిచింది.