ప్రజారోగ్య రంగంలో కీలక సంస్కరణలు

ప్రజారోగ్య రంగంలో కీలక సంస్కరణలు
  • కేంద్ర ప్రభుత్వం జన్‌ విశ్వాస్‌ చట్టం-2026 కింద ఆరోగ్య రంగంలో కీలక సంస్కరణలను అమలులోకి తెచ్చింది. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే నేరాలకు కఠినమైన శిక్షలను అలాగే కొనసాగించింది. ఔషధాలు, సౌందర్య ఉపకరణాల చట్టం-1940, ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006 కింద పలు చిన్న, సాంకేతిక ఉల్లంఘనలను నేరరహితంగా మార్చింది. ఈ సంస్కరణలు సాంకేతిక లేదా విధానపరమైన లోపాలకు, తీవ్రమైన ప్రజారోగ్య నేరాలకు మధ్య వ్యత్యాసాన్ని చూపడానికి ప్రయత్నిస్తాయని వివరించింది.
  • సవరించిన నిబంధనల ప్రకారం... గతంలో క్రిమినల్‌ చర్యలకు దారితీసిన కొన్ని సాంకేతిక, విధానపరమైన ఉల్లంఘనలను ఇప్పుడు పరిపాలనాపరమైన జరిమానాలుగా పరిగణించి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram