న్యాయ రంగంలో పరస్పర సహకారానికి వీలు కల్పించే ఒప్పందంపై భారత్, రష్యాలు సంతకాలు చేశాయి. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రష్యా అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఐగోర్ క్రాస్నోవ్లు ఈ ఒడంబడికపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రెండు దేశాలూ కృషి చేస్తున్నాయని వెల్లడించారు.