కీలక ఖనిజాల వ్యాల్యూ ప్రాసెసింగ్ పార్కులను ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కీలక ఖనిజాలకు ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు చాలా ముఖ్యమని గనుల కార్యదర్శి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రాసెసింగ్ వ్యవస్థ లేకుంటే దేశీయంగా, అంతర్జాతీయంగా సమీకరించిన ముడి కీలక ఖనిజాలను వినియోగించుకునే వీలుండదు. ఎగుమతి కూడా చేయలేమని ఆయన చెప్పారు.