అస్త్ర పరీక్షలు

అస్త్ర పరీక్షలు

దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మూడు కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఇందులో బహుళ అంచెల బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ (బీఎండీ) వ్యవస్థ, సరికొత్త మధ్యశ్రేణి నౌకా విధ్వంసక అస్త్రానికి సంబంధించిన పరీక్షలున్నాయి. ప్రత్యర్థి ప్రయోగించిన దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు (అవాక్స్‌), యుద్ధ విమానాలను వేగంగా గుర్తించి, వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, కచ్చితత్వంతో నేలకూల్చే బీఎండీ వ్యవస్థను భారత్‌ అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా భూవాతావరణ పరిధి లోపల (నేల నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు వరకూ), వాతావరణం వెలుపల ప్రత్యర్థి అస్త్రాలను ధ్వంసం చేసే బహుళ అంచెల రక్షణ కవచాన్ని రూపొందిస్తోంది. 2026, జూన్‌ 10, 11 తేదీల్లో రెండుసార్లు బీఎండీ వ్యవస్థను పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram