దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి ఏటా ఉపకార వేతనాలు అందిస్తోంది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది.
వివరాలు:
ఓఎన్జీసీ ఏటా మొత్తం 2000 స్కాలర్షిప్పులు అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్షిప్పులు మహిళలకు దక్కుతాయి.
అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్(బీఈ/బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2025-26 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.
స్కాలర్షిప్: ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయినంత వరకు ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.
ఎవరికి: దేశంలో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ (ఈడబ్ల్యుఎస్)ల్లో ప్రతిభావంతులైన పేదలకు
అర్హత:
వయసు: ఆగస్టు 1, 2025 నాటికి 30 ఏళ్లకు మించరాదు.
ఎంపిక: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీ మార్కులతో స్కాలర్షిప్లు మంజూరు చేస్తారు.
స్కాలర్షిప్ వ్యవధి: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.
కోర్సులవారీగా ఎన్ని?
ఇంజినీరింగ్: 500 (ఎస్సీ, ఎస్టీ), 300 ఓబీసీ, 300 జనరల్
ఎంబీబీఎస్: 90 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్
ఎంబీఏ: 140 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్
జియాలజీ/ జియోఫిజిక్స్: 270 (ఎస్సీ, ఎస్టీ), 100 ఓబీసీ, 100 జనరల్. దేశాన్ని 5 జోన్లగా విభజించారు. ఒక్కో జోన్ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్ 5 పరిధిలో ఉన్నాయి.
నిబంధనలు:
వేరే ఏ స్కాలర్షిప్పులూ మంజూరు కానివాళ్లే ఓఎన్జీసీ ప్రోత్సాహకాలకు అర్హులు. ఎంపికైనవారి వివరాలను ఓఎన్జీసీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. పైన తెలిపిన కోర్సుల్లో రెగ్యులర్ విధానంలో భారత్లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్కాలర్షిప్పు కొనసాగాలంటే ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా https://scholarships.gov.in/ లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP)లో నమోదు చేసుకోవాలి.
ఓఎన్జీసీ వెబ్సైట్లో వివరాలు నమోదుచేయాలి. వయసు, కుల ధ్రువీకరణ, పదో తరగతి మార్కులు, ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ మార్కులు, ఆదాయ ధ్రువీకరణ, బ్యాంకు అకౌంట్, పాన్ కార్డు, కాలేజీ ఐడీ, ప్రవేశ వివరాలు తదితర పత్రాలన్నీ అందించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 15.05.2026.
Link copied to clipboard!
మెకాన్ లిమిటెడ్లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత వైమానిక దళంలో గ్రూప్ 'సి' సివిలియన్ పోస్టులు
బీహెచ్యూలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
యూసీఐఎల్లో ఉద్యోగాలు
ఆర్సీబీ ఫరీదాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు
పీజీఐఎంఈఆర్లో పోస్టులు
ఎస్ఎస్సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ 2026
ఎన్ఐటీ సిక్కింలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు
ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, మొహాలిలో 2026-27- లా అడ్మిషన్లు
ఐసీఐ తిరుపతి/ నోయిడాలో బీబీఏ, ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) ప్రోగ్రామ్
సీపెట్లో బీటెక్ అడ్మిషన్లు
ఎన్టీఏ- జిప్మ్యాట్ 2026
చానక్య నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ప్రవేశాలు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్డీఎం-2026 ప్రోగామ్
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎలక్ట్రో-ఆప్టికల్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన పాక్
ట్రాన్సిట్ వీసా ఎత్తివేత
బ్రిటన్
జెలెన్స్కీకి అవార్డు
ఆస్ట్రేలియాకు తొలి మహిళా ఆర్మీ చీఫ్
ఇరాక్ అధ్యక్షుడిగా నిజార్ అమిది
సెకనుకు రూ.9.8 లక్షలు
వియత్నాం అధ్యక్షుడిగా తో లామ్
‘శిక్షాపత్రి’ గ్రంథ యాత్ర
మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లయింగ్
భారత్-న్యూజిలాండ్ ఎఫ్టీఏ
స్టాక్ మార్కెట్ల రేటింగ్ తగ్గించిన జేపీ మోర్గాన్
స్టార్టప్లు
లైబర్ ఏరోస్పేస్తో జెహ్ ఏరోస్పేస్ ఒప్పందం
ఐఎంఎఫ్ అంచనాలు
విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు
పేటెంట్ దరఖాస్తులు 1.43 లక్షలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)
హెక్టాకార్న్గా రిలయన్స్ రిటెయిల్
2026-27లో భారత వృద్ధి 6.6%
బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్
ఐఎస్ఎస్ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్
మహిళల అభివృద్ధి కార్యక్రమం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
లారియస్ అవార్డులు
అజిత్ అగార్కర్
ఆసియా జూడో ఛాంపియన్షిప్
రికార్డు స్థాయికి ఆహారధాన్యాల ఉత్పత్తి
హైకోర్టు సీజేగా జస్టిస్ లిసా గిల్
జాతీయ నమూనా సర్వే
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్చంద్ర పునేఠా
పంచాయతీ ఓటర్లు 2,89,10,279
క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్
ఏపీలో క్యాన్సర్ కేసులు
ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు
అమరావతికి రాజముద్ర
నాస్కామ్ కొత్త ఛైర్మన్గా శ్రీకాంత్ వెలమకన్ని
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సోమనాథ్
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్గా పద్మా డోర్జే
పవర్గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్