భారత స్వాతంత్య్రోద్యమంలో పురుషులతోపాటు మహిళలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు. ఆంగ్లేయుల అరాచకాలను ఎండగట్టడం, ప్రజలను సమీకరించడం, ధర్నాలు నిర్వహించడం, నిరసనలు చేపట్టడం లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తద్వారా ఉద్యమ స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో తమవంతు కృషి చేశారు. వీరు కేవలం స్వరాజ్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాక లింగ సమానత్వం, సామాజిక నిబంధనలు - కట్టుబాట్లను పునర్నిర్మించడంలోనూ కీలకంగా వ్యవహరించారు. దేశ చరిత్రలో స్త్రీ ఔన్నత్యాన్ని భారత స్వాతంత్య్రోద్యమం మరోసారి చాటిచెప్పింది. పోటీ పరీక్షల నేపథ్యంలో నాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనితల గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
ఝాన్సీ లక్ష్మీబాయి: డల్హౌసీ ప్రకటించిన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలుపరిచిన బ్రిటిషర్లు ఈమె దత్తపుత్రుడు దామోదరరావును సంస్థానాధీశుడిగా అంగీకరించకుండా ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించారు. దాంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు. 1858, జూన్లో జరిగిన గ్వాలియర్ యుద్ధంలో పాల్గొని బ్రిటిష్ దళాలతో వీరోచితంగా పోరాడారు. అదే యుద్ధంలో వీరమరణం పొందారు.
సావిత్రిబాయి ఫూలే: ప్రముఖ సంఘసంస్కర్త జ్యోతిరావు ఫూలే భార్య. లింగవివక్షకు వ్యతిరేకంగా కులరహిత సమాజం, సార్వత్రిక విద్య కోసం ఈ దంపతులు అవిశ్రాంత పోరాటం చేశారు. భర్తతో కలిసి 1848 పుణెలో బాలికల పాఠశాలను స్థాపించారు.
అనిబిసెంట్ (1847 - 1933): ఈమె ఐర్లాండ్కు చెందినవారు. దివ్యజ్ఞాన సమాజ సేవ కోసం భారతదేశానికి వచ్చారు. 1914లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. 1916, సెప్టెంబరులో హోమ్రూల్ లీగ్ స్థాపించి, స్వపరిపాలనను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమ ప్రచారానికి ‘కామన్ వీల్’, ‘న్యూ ఇండియా’ అనే పత్రికలు స్థాపించారు.
మాతంగిని హజ్రా (1870 - 1942): గాంధీజీ పిలుపు మేరకు, 1932లో బెంగాల్లోని మేధినీపుర్ జిల్లాలో శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తూములూక్ (toomluk) కోర్టు భవనంపై జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రయత్నించడంతో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది.
మేడం బికాజీ కామా (1861 - 1936): దాదాభాయ్ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల నుంచి ప్రేరణ పొంది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి బారినపడి, చికిత్స కోసం లండన్ వెళ్లారు. ఎందరో విప్లవకారులకు మార్గదర్శిగా నిలిచారు. ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ని స్థాపించారు.
కమలాదేవి చటోపాధ్యాయ: 1923లో గాంధీజీ పిలుపుమేరకు సహాయ నిరాకరణ ఉద్యమ సేవాదళ్ సంస్థలో పనిచేశారు. 1930లో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930, జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని పోలీసులు అడ్డుకున్నా, ఎగురవేశారు.
సరోజినీ నాయుడు: బొంబాయి (1915), లఖ్నవూ (1916) కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొన్నారు. 1925, డిసెంబరులో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు.
రాణి గైడిన్లు: మణిపుర్కు చెందిన ఈమె ఈశాన్య రాష్ట్రాల్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న ఈమెను బ్రిటిష్ ప్రభుత్వం 1932లో జైలుకు పంపింది.
ఉషా మెహతా: క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీతో సహా ప్రముఖ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ సమయంలో ఉషా మెహతా బొంబాయిలో రహస్య రేడియో ప్రసారాలతో ఉద్యమకారులను చైతన్యపరిచారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనితల గురించి పూర్తి సమాచారం ఈబుక్ రూపంలో ఈనాడు ఈప్రతిభ వాట్సాప్ ఛానెల్లో అందుబాటులో ఉంది. వెంటనే ఫాలో చేసి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారాన్ని ప్రతి రోజూ ఉచితంగా అందుకోండి. https://hov.to/e05e8f1a
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
ప్రశ్న: కింది ఏ రంగంలో చేసిన కృషికి సావిత్రీబాయి ఫూలే పేరు పొందారు?
(యూజీసీ నెట్ పేపర్ 2, 2019)
1) షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి 2) పేదల అభ్యున్నతి
3) మహిళల విద్య 4) మురికివాడల పిల్లల విద్య
సమాధానం: 3
ప్రశ్న: న్యూ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
(ఆర్ఆర్బీ గ్రూప్ - డి, 2018)
1) మదర్ థెరిస్సా 2) మహాత్మా గాంధీ
3) అనిబిసెంట్ 4) జవహర్లాల్ నెహ్రూ
సమాధానం: 3
Q: What was the fate of Rani Lakshmibai of Jhansi after the Battle of Gwalior in 1858?
(RPF Constable 2025)
1) She was captured and executed.
2) She became the ruler of Gwalior.
3) She died fighting in battle.
4) She was exiled to Britain
Ans: 3
Link copied to clipboard!
పీజీఐసీహెచ్ నోయిడాలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎన్బీసీసీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
ఐఐటీ బీహెచ్యూలో డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాలు
టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
టీఎంసీలో టీచింగ్/నాన్ టీచింగ్ పోస్టులు
ఎన్టీపీసీలో ఇంజినీర్ పోస్టులు
ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో టెక్నీషియన్ ఉద్యోగాలు
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎస్ఈసీఐ దిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్ఎస్ఎస్ఎన్ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఫుడ్ వాలాస్ కంపెనీలో ఇంటర్న్షిప్ పోస్టులు
వియ్ సోర్స్ యు కంపెనీలో ఇంటర్న్షిప్ పోస్టులు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్షిప్
కేజీఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్లో ఇంటర్న్షిప్ పోస్టులు
డిజైన్ బీహెచ్కే ఇంటర్న్షిప్ ఉద్యోగాలు
మార్పు ఫౌండేషన్లో ఇంటర్న్షిప్ పోస్టులు
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్షిప్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో అప్రెంటిస్షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్హెచ్లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం