భారత సుప్రీంకోర్టు

భారత సుప్రీంకోర్టు

మన దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటై, స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ దేశ పాలన రాజ్యాంగబద్ధంగా కొనసాగడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రాజ్యాంగ పరిరక్షణ, పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు బాధ్యత వహిస్తుంది. దేశ పరిపాలన చట్టబద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా జరిగే విధంగా చేయడంలో సుప్రీంకోర్టు ముఖ్య భూమిక పోషిస్తుంది. బ్రిటిష్‌ కాలంలో ఫెడరల్‌ కోర్ట్‌గా ఉన్న అత్యున్నత న్యాయస్థానం 1950 జనవరి 28న ‘సుప్రీంకోర్టు ఆఫ్‌ ఇండియా’గా మారింది. పోటీపరీక్షల నేపథ్యంలో దీనికి సంబంధించిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

చారిత్రక నేపథ్యం

  • బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్‌ 1772లో భారతదేశంలో ఒక వ్యవస్థీకృత న్యాయవ్యవస్థను ప్రవేశపెట్టారు. దేశంలో తొలి సుప్రీంకోర్టును ఈస్టిండియా కంపెనీ ఏర్పాటు చేసింది. ‘రెగ్యులేటింగ్‌ చట్టం-1773’ ప్రకారం 1774, మార్చి 16న కలకత్తాలోని ఫోర్ట్‌ విలియంలో ఇది ప్రారంభమైంది. తొలి ప్రధాన న్యాయమూర్తి సర్‌ ఎలిజా ఇంఫే కాగా, ఇతర న్యాయమూర్తులు సీజర్‌ లైమెస్టర్, జాన్‌హైడ్, రాబర్ట్‌ చాంబర్స్‌.
  • ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ ప్రకారం కలకత్తాలోని సుప్రీంకోర్టును ‘ఫెడరల్‌ కోర్టు’గా మార్చి 1937లో దిల్లీలో ఏర్పాటు చేశారు. దీని తొలి ప్రధాన న్యాయమూర్తి సర్‌ మారిస్‌ గ్వేయర్‌.  
  • స్వాతంత్య్రానంతరం ‘ఫెడరల్‌ కోర్టు’ 1950, జనవరి 28 నుంచి సుప్రీంకోర్టుగా మారింది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. తొలి ప్రధాన న్యాయమూర్తి ‘హరిలాల్‌ జె కానియా’. 

ముఖ్యాంశాలు

  • మన సుప్రీంకోర్టు ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థను అనుసరిస్తోంది. ఏకీకృత న్యాయవ్యవస్థ విధానాన్ని బ్రిటిష్‌ రాజ్యాంగం నుంచి స్వీకరించగా, స్వతంత్య్ర న్యాయవ్యవస్థ విధానాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. 
  • చట్టానికి సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలను నిర్ణయించాల్సిన సమయంలో న్యాయమూర్తులు ఇద్దరు/ ముగ్గురు (డివిజన్‌ బెంచ్‌)తో కూడిన ధర్మాసనంగా లేదా అయిదుగురు/ అంతకంటే ఎక్కువ మందితో (కాన్‌స్టిట్యూషనల్‌ బెంచ్‌) కూడిన ధర్మాసనంగా సమావేశమవుతారు.
  • ఆర్టికల్‌ 124(2) ప్రకారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 
  • సుప్రీంకోర్టు అధికారాలు, పరిధిని విస్తృతం చేసే లేదా జోడించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. అయితే వాటిని కుదించడం మాత్రం కుదరదు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

Q: భారత సుప్రీంకోర్టు న్యాయసమీక్ష అధికారాన్ని కలిగి ఉంది. న్యాయసమీక్ష అంటే?  (టీఎస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ 2016)

1) రాష్ట్ర హైకోర్టుల తీర్పులను సమీక్షించడం

2) మంత్రిమండలి విధులను సమీక్షించడం 

3) భారత రాష్ట్రపతికి సలహా ఇవ్వడం

4) శాసనశాఖ ఆమోదించిన చట్టాలు, కార్యనిర్వాహకశాఖ ఆదేశాల రాజ్యాంగ బద్ధతను నిర్ణయించడం

సమాధానం: 1

Q: 1774లో కలకత్తాలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి? (ఏపీ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ 2018)

1) సర్‌ ఎలిజా ఇంఫే   2) జాన్‌హైడ్‌      3) రాబర్ట్‌ చాంబర్స్‌     4) హెచ్‌.జె.కానియా

సమాధానం: 1

Q: భారత రాజ్యాంగంలోని 124వ అధికరణ దేని స్థాపనను సూచిస్తుంది? (ఏపీపీఎస్సీ, గ్రూప్‌-2, 2012)

1) హైకోర్టు               2) జిల్లా కోర్టు           3) ప్రీవి కౌన్సిల్‌            4) సుప్రీంకోర్టు

సమాధానం: 4

Q: With reference to Indian Judiciary, consider the following statements. 
a) Any retired judge of the Supreme Court of India can be called back to sit by the Chief Justice of India with prior permission of the President of India.
b) A High Court in India has the power to review its own judgement as the Supreme Court does.
Which of the statements given above is/are correct? (UPSC Prelims 2021)
1) a only       2) b only         3) Both a and b         4) Neither a nor b
Answer: 1

Q: Consider the following statements: 
a) The 44th Amendment to the Constitution of India introduced an article placing the election of the Prime Minister beyond judicial review.
b) Supreme Court of India struck down the 99th amendment to the Constitution of India as being violative of the independence of the judiciary
Which of the statements given above is/are correct? (UPSC Prelims 2019)
1) a only         2) b only          3) Both a and b          4) Neither a nor b
Answer: 2

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram