దేశంలోని అగ్రగామి 1% మంది కుబేరుల సంపద 2000 నుంచి 2023 మధ్య 62% పెరిగిందని దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఏర్పాటైన జీ20 నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు ‘అత్యయిక’ స్థాయులకు చేరాయని, ప్రజాస్వామ్యం, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులకు ముప్పుగా మారాయని నివేదిక పేర్కొంది. నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ నేతృత్వంలో అధ్యయనం చేసి, ఈ నివేదిక రూపొందించారు. అంతర్జాతీయ అసమానతలపై ఏర్పాటైన స్వతంత్ర నిపుణుల జీ20 అసాధారణ కమిటీలో ఆర్థికవేత్తలు జయతి ఘోష్, విన్నీ బ్యానిమా, ఇమ్రాన్ వలోడియా ఉన్నారు.