233 ఏళ్ల కిందటి రామాయణం

233 ఏళ్ల కిందటి రామాయణం

అయోధ్యలోని అంతర్జాతీయ ‘రామకథ’ గ్రంథాలయానికి 233 ఏళ్ల కిందటి అరుదైన వాల్మీకి రామాయణం (తత్వదీపికతో) సంస్కృత రాతప్రతులను కానుకగా అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహేశ్వర తీర్థ శాస్త్రీయ వ్యాఖ్యానం (టీకా)తో ఉన్న 1792 నాటి ఈ వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం (దేవనాగరి లిపి)లో రాసి ఉంది. తాత్వికత లోతును ప్రతిబింబించే ఈ ఇతిహాసం బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే అయిదు విభాగాలుగా ఉంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram