ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూ సిటీ రైల్వేస్టేషన్ను మొత్తం మహిళలే నిర్వహించే రైల్వేస్టేషనుగా మార్చారు. కంట్రోల్ రూం నుంచి టికెట్ల విక్రయం వరకు ప్రతి పని మహిళా ఉద్యోగుల చేతుల మీదుగానే సాగుతుందని రైల్వేశాఖ 2025, అక్టోబరు 21న వెల్లడించింది.
ప్రయాణికుల భద్రత, గస్తీ, సిగ్నల్ క్యాబిన్ల నిర్వహణ లాంటి విధులకు మొత్తం 34 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరంతా దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు.