భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్గా పేరొందిన ‘ఎల్వీఎం3-ఎం5’ వాహకనౌక ద్వారా ఇది నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి 2025, నవంబరు 2న ప్రయోగం జరిగింది.
ఇది ఇస్రో నుంచి 103వ ప్రయోగం. ఈ శాటిలైట్ 15 ఏళ్ల పాటు కమ్యూనికేషన్ సేవలు అందించనుందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ వెల్లడించారు. 2013లో ప్రయోగించిన జీశాట్-7 ఉపగ్రహ స్థానంలో ఇది సేవలందిస్తుందన్నారు.