‘జీవన్‌దాన్‌’

‘జీవన్‌దాన్‌’

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘జీవన్‌దాన్‌’ ద్వారా 2025లో 301 మందికి పునర్జన్మ లభించింది. రాష్ట్ర విభజన తర్వాత అవయవదానంలో ‘జీవన్‌దాన్‌’ సరికొత్త రికార్డు సృష్టించింది. జీవన్మృతులైన 93 మంది నుంచి సేకరించిన అవయవాలతో 301 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. రాష్ట్రంలో జీవన్‌దాన్‌ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు 1,296 అవయవాలు సేకరించారు. ఈ పదేళ్లలో జీవన్మృతులైన 403 మంది నుంచి 703 కిడ్నీలు, 316 కాలేయాలు, 181 ఊపిరితిత్తులు, 91 గుండెలు తదితరాలు సేకరించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram