ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబరు) భారత్ 8.2% వృద్ధిని నమోదు చేసింది.ఈ విషయాన్ని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) 2025, నవంబరు 28న తెలిపింది.ఇది ఆరు త్రైమాసికాల గరిష్ఠస్థాయి.జీఎస్టీ రేట్ల కోతలతో వినియోగం పెరుగుతుందనే అంచనాల మధ్య పరిశ్రమ ఉత్పత్తి అధికమైంది.అందువల్లే వ్యవసాయ ఉత్పత్తి తగ్గినా.. జీడీపీ రాణించగలిగింది.
2025-26 తొలి త్రైమాసిక వృద్ధిరేటు 7.8%, 2024-25 జులై-సెప్టెంబరులోని 5.6% కంటే తాజా గణాంకాలు మిన్నగా ఉన్నాయి.సేవల రంగం రెండంకెల వృద్ధి సాధించడమూ కలిసొచ్చింది.2023-24 నాలుగో త్రైమాసికంలో నమోదైన 8.4% వృద్ధి తర్వాత, అత్యధిక వృద్ధి ఇదే.