2025లో దేశవ్యాప్తంగా వినియోగదార్లకు మొత్తం మీద రూ.45 కోట్ల రిఫండ్లను రికవరీ చేయడంలో జాతీయ వినియోగదార్ల హెల్ప్లైన్ (ఎన్సీహెచ్) సాయం చేసింది. 67,265 వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ఇ-కామర్స్ రంగంపై అత్యధికంగా సుమారుగా 40,000 ఫిర్యాదులు రాగా, వాటిని పరిష్కరించి రూ.32 కోట్లను రికవరీ చేసింది. ఇది మొత్తం చెల్లింపుల్లో మూడింట రెండు వంతుల కంటే అధికం. తర్వాతి స్థానంలో ప్రయాణ, పర్యాటక రంగం (రూ.3.5 కోట్లు) ఉంది.
వినియోగదార్లు తమ ఫిర్యాదులను టోల్-ఫ్రీ-నంబరు (1915), వాట్సప్ (8800001915), ఎస్ఎంఎస్, ఇమెయిల్, వెబ్ పోర్టల్ ద్వారా 17 భాషల్లో నమోదు చేసే సదుపాయం ఉంది.