భారత సంతతికి చెందిన చరిత్రకారుడు సునీల్ అమృత్(46) రచించిన ‘ది బర్నింగ్ ఎర్త్: యాన్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ 500 ఇయర్స్’ పుస్తకం 2025 ఏడాది బ్రిటిష్ అకాడమీ బుక్ప్రైజ్ గెలుచుకొంది. ఈ పురస్కారంలో భాగంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన నాన్-ఫిక్షన్ రచనల్లో ఉత్తమ పుస్తకాన్ని ఎంపిక చేసి 25 వేల పౌండ్ల బహుమతిని అందిస్తారు.
కెన్యాలో జన్మించిన అమృత్ అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.