అగ్ని-3 పరీక్ష విజయవంతం

అగ్ని-3 పరీక్ష విజయవంతం
  • అణ్వస్త్రాలను మోసుకెళ్లగల అగ్ని-3 బాలిస్టిక్‌ క్షిపణిని భారత్‌ 2026, ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపుర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రం పరిధి 3వేల కిలోమీటర్ల పైనేనని అధికారులు తెలిపారు. 
  • అధునాతన క్షిపణి అయిన అగ్ని-3.. ఇప్పటికే భారత సైనిక దళాల అమ్ములపొదిలో చేరింది. 1.5 టన్నుల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. దీని పొడవు 17 మీటర్లు. ఘన ఇంధనంతో పనిచేసే రెండు దశలు ఇందులో ఉన్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram