అంతర్జాతీయ ఉమ్మడి వేదిక అయిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సాధారణ బడ్జెట్కు భారత్ తన వంతుగా రూ.317 కోట్లను చెల్లించింది. ఈ చెల్లింపును ఫిబ్రవరి 3 నాటికి పూర్తి చేయడంతో సకాలంలో నిధులు అందించిన 47 సభ్య దేశాల గౌరవ జాబితాలో భారత్ చోటు సంపాదించింది.
Link copied to clipboard!
బ్రిటన్లో పర్యాటకులు ఎలక్ట్రానిక్ వీసా (ఇ-వీసా)లను కలిగి ఉండటాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ...
భారత్, పశ్చిమాసియా, దాని చుట్టూ ఉన్న దేశాలతో కలిసి త్వరలో షడ్భుజి కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ...
పెరూ దేశ అధ్యక్షుడిగా 2026, ఫిబ్రవరి 19 మాజీ న్యాయమూర్తి జోస్ మారియా బల్కజార్(83) ఎన్నికయ్యారు. 10 ఏళ్లలో ఈయన 8వ అధ్యక్షుడు. అవినీతి ఆరోపణల కారణంగా తాత్కాలిక అధ్యక్షుడు జోస్ జెరీని తొలగించిన మరుసటి రోజే ఈ ఎన్నిక జరిగింది....
పార్లమెంటు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన జపాన్ ప్రధాన మంత్రి సానే తకాయిచి 2026, ఫిబ్రవరి 18న రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు....
బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బీఎన్పీ నేత తారిఖ్ రహమాన్ (60) 2026, ఫిబ్రవరి 17న పదవీ ప్రమాణం చేశారు. సంప్రదాయానికి భిన్నంగా బంగ భవన్ను కాదని జతియా సంసద్వద్ద ఉన్న దక్షిణ ప్లాజా బహిరంగ ఆవరణలో ఆయన ప్రమాణం చేశారు. ...
బ్రిటన్, కెనడా దేశాల ప్రజలకు చైనా వీసా లేకుండా పర్యటించే అవకాశం కల్పించింది. దీంతో ఇలాంటి సదుపాయం ఉన్న దేశాల సంఖ్య 79కి పెరిగింది. తమ దేశంలో పర్యాటకాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చైనా ఈ సదుపాయం కల్పించింది. ...
బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల స్థానాల్లో నెగ్గి.. రెండు దశాబ్దాల తర్వాత బంగ్లా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ...
బ్రిటన్కు చెందిన రాయల్ ఎయిర్ఫోర్స్ (ఆర్ఏఎఫ్) పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత వాయుసేన (ఐఏఎఫ్) తొలిసారి సిద్ధమైంది. దిల్లీ వేదికగా 2026, ఫిబ్రవరి 12న జరిగిన 19వ బ్రిటన్-భారత్ వైమానిక సిబ్బంది చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది....
అమెరికా, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. దీంతో బంగ్లాపై సుంకాలు ప్రస్తుతమున్న 20 శాతం నుంచి.. 19 శాతానికి తగ్గనున్నాయి. ...
ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన కాషివాజాకి-కరీవా ప్లాంట్ను జపాన్ 2026, ఫిబ్రవరి 9న పునఃప్రారంభించింది. గతంలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన ఈ కర్మాగారం తిరిగి విద్యుదుత్పత్తికి సిద్ధమైంది. ...
జపాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధానమంత్రి సనాయీ తకాయిచి నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 465 సీట్లున్న దిగువ సభకు 2026, ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగ్గా.. అధికార కూటమి మూడింట రెండొంతులకుపైగా స్థానాలను దక్కించుకుంది. ...
బ్రిటిష్ కాలంలో రైతు తిరుగుబాట్లు
రామకృష్ణ పరమహంస
మహాసముద్రాలు - విశేషాలు
గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన
లోక్సభ స్పీకర్
పర్యావరణ పరిరక్షణ సంస్థలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved