ఓయూ దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్

ఓయూ దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జి.రామ్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ 2025-26 విద్యా సంవత్సరానికి దూర విద్య విధానంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ఎంబీఏ

2. ఎంసీఏ

కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: ఎంబీఏ కోర్సుకు ఏదైనా గ్రాడ్యుయేట్; ఎంసీఏ కోర్సుకు గణితం సబ్జెక్టుగా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. టీజీ/  ఐసెట్‌-2025లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో నేరుగా ప్రవేశం పొందవచ్చు.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.900.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. సెక్షన్‌-ఏ అనలిటికల్‌ ఎబిలిటీ 35 మార్కులు; సెక్షన్‌-బి మ్యాథమెటికల్‌ ఎబిలిటీ 40 మార్కులు; సెక్షన్‌-సి కమ్యూనికేషన్‌ ఎబిలిటీ 25 మార్కులు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.09.2025

* దరఖాస్తుకు చివరి తేదీ: 02-09-2025.

* రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 05-09-2025.

* ప్రవేశ పరీక్ష తేదీ: 07-09-2025.

Website: http://www.oucde.net/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram