ప్రస్తుతం మన దేశంలో ముడిచమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్ బ్యారెళ్ల (దాదాపు 4000 కోట్ల లీటర్లు) ఇంధన నిల్వలున్నాయని ప్రభుత్వం 2026, మార్చి 8న వెల్లడించింది....
కొత్త గవర్నర్లు
Published: March 5, 2026
కేంద్ర ప్రభుత్వం 2026, మార్చి 5న 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఇప్పుడు నియమించిన 9 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు/ లెఫ్టినెంట్ గవర్నర్లలో అయిదుగురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ...
ప్రగతి, వికాస్
Published: March 5, 2026
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా హోంమంత్రి అమిత్ షా 2026, మార్చి 5న ప్రగతి, వికాస్ పేరుతో రెండు జనగణన చిహ్నాలను ఆవిష్కరించారు....
రక్షణ మంత్రిత్వశాఖ ఒప్పందం
Published: March 3, 2026
భారత తీరగస్తీ అవసరాల నిమిత్తం ఆరు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు (ఏఎల్హెచ్), వర్టికల్ లాంచ్ మిసైల్స్ (వీఎల్ఎం) తయారీకి రెండు సంస్థలతో రక్షణ మంత్రిత్వశాఖ రూ.5,083 కోట్ల విలువగల ఒప్పందాలను చేసుకుంది. ...
హెచ్పీవీ వ్యాక్సినేషన్
Published: February 28, 2026
దేశవ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని 2026, ఫిబ్రవరి 28న రాజస్థాన్లోని అజ్మేర్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు....
ప్రచండ్
Published: February 27, 2026
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 27న గగనవిహారం చేశారు. ఫ్లయింగ్ సూట్ ధరించిన ఆమె.. 25 నిమిషాలపాటు కో పైలట్గా వ్యవహరించారు....
ఐఐటీహెచ్తో ఎన్ఎండీసీ ఒప్పందం
Published: February 26, 2026
ఖనిజాల పరిశోధనల కోసం హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)తో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఒప్పందం చేసుకుంది. ...
ఏప్రిల్ 1 నుంచి పెట్రోలులో 20% ఇథనాల్ తప్పనిసరి
Published: February 25, 2026
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2026 ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా పెట్రోలులో 20% వరకు ఇథనాల్ కలిపి విక్రయించాలని కేంద్రం తెలిపింది....
కేరళ పేరు ‘కేరళం’
Published: February 24, 2026
కేరళ పేరును ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు 2026, ఫిబ్రవరి 24న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది....
ప్రహార్
Published: February 23, 2026
కేంద్ర ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 23న ‘‘ప్రహార్’’ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిర్మూలన విధానాన్ని ప్రారంభించింది. బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం వహించరాదన్నది ఈ విధానంలోని ప్రధాన అంశం. ...
రాష్ట్రపతి భవన్లో రాజగోపాలాచారి విగ్రహం
Published: February 23, 2026
స్వతంత్ర భారతదేశపు తొలి, ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 23న ఆవిష్కరించారు. ...
అత్యంత వేగమైన మెట్రో రైలు
Published: February 22, 2026
దేశంలోనే అత్యంత వేగంగా గంటకు 120 కి.మీ. వెళ్లే మెట్రోరైలును ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో 2026, ఫిబ్రవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ...
సహ్యోగ్
Published: February 20, 2026
ఆన్లైన్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలను, తప్పుడు సమాచార ప్రసారాన్ని నియంత్రించేందుకు కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తెచ్చిన సహ్యోగ్ అస్త్రం మంచి ఫలితాలు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ...
ప్యాక్స్ సిలికా కూటమిలో భారత్
Published: February 20, 2026
అమెరికా నేతృత్వంలో ఏర్పడిన వ్యూహాత్మక కూటమి ‘ప్యాక్స్ సిలికా’లో భాగస్వామిగా భారత్ 2026, ఫిబ్రవరి 20న చేరింది. దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్లో జరిగిన ఒక కార్యక్రమంలో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేసింది....
ఐఎన్ఎస్ విక్రాంత్
Published: February 19, 2026
అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ)కు భారత బాహుబలిగా పేరుగాంచిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖ తీరానికి వచ్చింది. మూడేళ్ల క్రితం నౌకాదళంలో చేరిన ఈ నౌకను సాగర జలాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తారు....
మిలన్-2026
Published: February 19, 2026
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో 2026, ఫిబ్రవరి 19న ‘మిలన్-2026’ను ప్రారంభించారు. ...
ఇండియా ఇంపాక్ట్ సమిట్
Published: February 19, 2026
ఇండియా ఇంపాక్ట్ సమిట్ను 2026, ఫిబ్రవరి 19న దిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ సక్రమ వినియోగానికి ‘మానవ్’ (ఎంఏఎన్ఏవీ) విజన్ను ఆవిష్కరించారు. ...
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)
Published: February 17, 2026
అంతర్జాతీయ ఉత్సవం ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 17న లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ ఈఎన్సీ ఆఫీసర్స్ మెస్లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇవ్వడం ద్వారా ఇది మొదలైంది. ...
దేశంలో విద్యుదుత్పత్తి
Published: February 15, 2026
దేశవ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి పదినెలల్లో 50వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ తెలిపింది....
పీఎం రాహత్ పథకం
Published: February 14, 2026
రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి, చికిత్స భరోసా(పీఎం రాహత్) పథకాన్ని కేంద్రం 2026, ఫిబ్రవరి 14న అధికారికంగా ప్రారంభించింది...
‘ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ’
Published: February 14, 2026
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో ఉన్న జాతీయ రహదారి-37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ఈఎల్ఎఫ్)ని ప్రధాని మోదీ 2026, ఫిబ్రవరి 14న ప్రారంభించారు...
ప్రధాని కొత్త కార్యాలయం
Published: February 13, 2026
కొత్తగా నిర్మించిన ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) - సేవా తీర్థ్ను ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 13న ప్రారంభించారు. సేవా తీర్థ్లో ప్రధాని కార్యాలయంతోపాటు జాతీయ భద్రత మండలి సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్ ఉంటాయి....
రక్షణ రంగం
Published: February 12, 2026
భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) 2026, ఫిబ్రవరి 12న ఆమోదముద్ర వేసింది. ...