స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (జీఐజీజీ) సంస్థను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా హబ్, స్పోక్ నమూనాలో దీన్ని అమలు చేయనున్నారు. జీఐజీజీ ఎపెక్స్ హబ్గా.. శిక్షణ సంస్థలు స్పోక్గా ఉంటాయి. రాష్ట్రంలో మానవవనరుల సామర్థ్యం పెంపునకు దీన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద ఏర్పాటుచేసింది. ఈ సంస్థ ప్రణాళిక శాఖ నియంత్రణలో పనిచేస్తుంది.