అమెరికాకు చెందిన ఇంజినీరింగ్ దిగ్గజం ఓషియనీరింగ్ ఇంటర్నేషనల్తో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్)కు చెందిన మెరైన్ ప్లాట్ఫామ్ ‘ఆస్ట్రో ఆఫ్షోర్’ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఐరోపాలో ప్రత్యేకమైన సముద్రగర్భ- తీరప్రాంత సేవల (స్పెషలైజ్డ్ సబ్సీ, ఆఫ్షోర్ సర్వీసెస్) విపణిలోకి అదానీ పోర్ట్స్ అడుగుపెట్టడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.
ఇందులో భాగంగా 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి 200 నౌకలతో అంతర్జాతీయ మెరైన్ ఫ్లీట్ ఏర్పాటు చేయడానికి, రూ.13,000 కోట్లు కేటాయించాలని అదానీ పోర్ట్స్ లక్ష్యంగా పెట్టుకుంది.